ధర్మపురి ప్రయాణం లో నేను రాసుకున్న రెండవ పాట ఇది. ఈపాటలో చమత్కారం నాకు బాగా నచ్చింది. పదాలు వాడిన విధానం అద్భుతం. పాట ఇది.
పున్నపు వెన్నెల వలలో పూసీ కాయంగ వలలో
అమాస చీకటిలో వలలో ఆగి కాయంగా వలలో
చుక్కల రాణి వల్లో చూడనిచ్చినాదీ వల్లో
చూసినంతయూ చూసీ వల్లో సుడికొంగులువట్టే వల్లో
మైకొంగులు వట్టే వల్లో మీరెవ్వారే వల్లో
మేనత్తకొడుకూనీ వల్లో నీబావనీ వల్లో
నీ అమ్మనాన్నలకూ వల్లో నేనే అల్లుడినీ వల్లో
వాళ్ళింటి ముంగట వల్లో కల్యాప చెట్టూ వల్లో
కోతలు కాసిందీ వల్లో పూతలు పూసిందీ వల్లో
కాయలు కోపిచ్చీ వల్లో కాటుకలిప్పిచ్చీ వల్లో
ఇదికాస్త మాఇంటికీ వల్లో ఇచ్చీవస్తావా వల్లో
ఇచ్చీవత్తురుగానీ వల్లో ఇల్లూ ఎరుకలేదూ వల్లో
పోయీవత్తునుగానీ వల్లో పోలికతెలియరాదూ వల్లో
పోంగా మా ఇల్లూ వల్లో పోకల దర్వాజా వల్లో
రాంగా మా ఇల్లూ వల్లో రంగుల తలుపూలూ వల్లో!!!!.
Posted 10 hours, 21 minutes ago at 6:13 am. Add a comment
ఇటీవలె నేను ధర్మపురికి వెళ్ళాను.
ఆరోజు స్వామివారి కళ్యాణం జరుగుతోంది. ఇసకేస్తే రాలనంత జనం. అయినా, తెలిసిన వారుండటంతో దర్శనాలు సులభంగా అయ్యాయి.
ఆ హడావిడినుంచి బయటకు వచ్చి, గుడికి దూరంగా, ప్రశాంతంగా వున్న చోట విశ్రాంతి తీసుకుంటూంటే కొందరు ఆడపిల్లలు ఇల్లిల్లూ తిరుగుతూ పాటలు పాడటం వినిపించింది.
ఆ పాటలు వింటూ వారిని వెంబడించాము.
వారందరూ 10 నుండి 14 ఏళ్ళ లోపు వారు. జాతరలో ఏవయినా కొనుక్కునేందుకు ఇలా పాటలు పాడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ పాటలు వాళ్ళ అమ్మలు నేర్పారట.
వారిని అడిగి కొన్ని పాటలు రాసుకున్నాను. వాటిల్లో ఒకటి ఈ పాట.
పాటలో పదాలు చూడండి. సాహిత్యం చూడండి. చమత్కారం చూడండి. శృంగారం చూడండి. గడుసుదనం, అమాయకత్వాలు చూడండి. అత్యద్భుతంగా వున్నాయీ పాటలు వారు పాడుతూంటే. అందులోని ఒక పాట ఇది. వీలువెంబడి మిగతా పాటలు అంద్చేస్తాను.
ఈ పాటలో ఓ రాణి అన్నచోట ఎవరిపేరయినా పెట్టుకోవచ్చట.
కందిపూసె కందిగాసె
కంది కోడలు నంది మేసె
నందీవేల నువ్వేరాగనే
ఒ రానీ, మందీ కండ్లు మంట మండెనే, నా రాణీ
దుంపు దుంపు నీ కురులు
దుయ్యరారు, ముడువరారు
దూసిమడసె కొప్పు వెట్టవే
ఓరానీ, కొప్పునిండా గుప్పెడు మల్లెలే…
కొప్పును చూసిరాపోతివే నా రానీ……
Posted 2 days, 10 hours ago at 6:09 am. Add a comment
బ్రహ్మబుధ్ బుధగ్రహానికి చెందినవాడు. మానవ మనస్తత్వం పైన రీసెర్చ్ చేయటానికి వచ్చి, మన గ్రహం నచ్చి ఇక్కడే వుండిపోయాడు.
ఈమధ్య నా జోలికి రాకపోవటంతో పీడాపోయిందని సంతోషించాను. అయితే, నేను ఎక్కువ కాలం సంతోషంగా వుండటం దేవుడికేకాదు, బ్రహ్మబుధ్ కు కూడా ఇష్టం వున్నట్టులేదు.
రాత్రి నేను గాఢ నిద్రలో వుండగా భళ్ళుమని నా మెదడు తలుపులు తన్ని, చ్చళ్ళుమని నా ఆలోచనల కిటికీలను విరిచి, ఖళ్ళుమని, నా ఊహల పల్లకీని ఎత్తిపారేసి నా మెదడులోకి దూకి వికటాట్టహాసపు వికృత చేష్ట ఒకటి చేశాడు. వాడి వంకర నవ్వు సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన ఒక తెలుగు పౌరాణిక నవలలో ఒక కొంటె అన్న తానిచ్చిన ముత్యాల హారం తన చెల్లెలి మెడలో వేసుకోగా అది ఆమె ఇరు వక్షోజాల నడుమ అటూ ఇటూ ఆడుతూంటే చూసి కొంటెగా నవ్విన నవ్వు అంత స్వచ్చంగా, పవిత్రంగా వుంది.
నాలాంటి కుళ్ళిన మెదడు వాడికి కుళ్లు ఆలోచనలొస్తే, ఏమి అన్నకు తన చెల్లెల్లిని చూసి వంకరగా నవ్వే స్వేచ్చలేదా? అని ఆధునిక అభ్యుదయ, వావివరసలులేని హేతువాద వీరులు విరుచుకు పడతారేమోనని నూరుమూసుకున్నాను.
ఇప్పుడు బ్రహ్మబుధ్ అలా నవ్వగానే నా మనస్సు కీడును శంకించింది. నేను మగవాడినయిపోయాను. అయినా మగవాడికి సాటి మగవాడినుంచీ రక్షణ లేని కాలం ఇది. స్వలింగ సంపర్కం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం అంటారు అభివృద్ధి చెందిన స్వేచ్చావాదులు,
అందుకే ఏం మాట్లాడితే ఏమి వస్తుందోనని నోరు తెరచుకుని అల్లాగె వుండిపోయాను.
ఏమోయ్ నువ్వేదో సౌశీల్య ద్రౌపది అని పుస్తకం రాశావట? అడిగాడు బ్రహ్మబుధ్ నా డెత్ వారంట్ చదివి వినిపిస్తున్నట్టు.
తలవూపాను.
పోన్లే అయిదుగురు భర్తలతో ఒక స్త్రీ సుఖించటాన్ని ప్రదర్శించటంలో తప్పేమిటని మహిళామణులే నిలదీసి అడిగిమరీ లొట్టలేసుకుంటూ సెక్స్ వర్ణణలు చదివుతూంటే నీకు అభ్యంతరాలేమిటోయ్? చేతనయితే నువ్వూవర్ణించు నీ మనసులో అణగివున్న వికృత కోరికలన్నిటినీ ఏదో పురాణపాత్రకు ఆపాదించి. సాహిత్య అకాడెమీ అవార్డు రాకున్నా కనీసం సంస్కృతీ భక్షక అహేతువాద శిఖామణులందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటారు.
నేను మాట్లాడలేదు.
కాస్సేపు నా వైపు నిరసనగా చూస్తూ నిలబడ్డాడు. చివరికి నెమ్మదిగా అన్నాడు.
నేను సత్యభామను కలసి వస్తున్నాను.
నాకు అర్ధం కాలేదు.
నాకు తెలిసి సత్యభామలు ఎవరూ లేరు. కనీసం చిన్నప్పుడు గొల్లభామలను కూడా పట్తుకోలేదు. ఈ సత్యభామ ఎవరు? అడిగాను.
విచిత్రంగా చూశాడు. సత్యభామ తెలియదా?
సిగ్గుపడుతూ చెప్పాను. తెలియదు.
ఆమేనోయ్, మీ ద్రౌపదికి సవితి.
ద్రౌపదికి సవితా?
అదేనోయ్, కృష్ణుడి ప్రేమ కోసం పోటీపడే ద్రపది సత్యభామలు.
నాకు అర్హ్దంకాలేదు.
ద్రౌపదికి సత్యభామకు పోటీ ఏమిటి? ఒకరు చెల్లెలు, మరొకరు భార్య.
అదే నీ మధ్యతరగతి ఎదగని మనస్తత్వం. సత్యభామకు ద్రౌపది మీద కోపం వచ్చింది.
ఎందుకు?
ఎందుకేమిటి. ద్రౌపది తనతో సమయం గడపటం లేదని కృష్ణుడు అర్జునిడికి తన చెల్లెలినిచ్చి వివాహం జరిపించాడు కదా, అలాగే కృష్ణుడిని కట్టిపడేసుకోటానికి ద్రౌపదికూడా సత్యభామకు ఇంకో పెళ్ళి చేయవచ్చి కదా?
కృష్ణుడికి 16000 గోపికలు ఎనిమిది భార్యలు ఉన్నారు. ఇంకోపెళ్ళివల్ల కొత్తగా ఒరిగేదేమీ లేదు, అసహ్యంగా అనిపిస్తున్నా అన్నాను.
నేనంటున్నదీ అదే. కృష్ణుడికి అంతమంది వుండగా సత్యభామకు ఒక్క కృష్ణ్డే వుండటం సమస్త స్త్రీ జాతికే అవమానం. పురుషులకో నీతి, స్త్రీలకో నియమమా?
కానీ…
నీకు తెలుసా సత్యభామకు బలరాముదిపైన మనసుంది. బలరాముడికి ఒకే భార్య. అదే తమ్ముడు చూడు.
సిగ్గుతో తలవంచుకున్నాను. ఏమవుతోంది మనుషుల మెదళ్ళకు, అర్ధంకాలేదు.
నీకో నిజం తెలుసా, మీ బ్లాగ్లోకంలోనే, వదినతో సంబంధం అభ్యుదయం, ప్రగతికి నిదర్శనం అని ఎన్లైటెండ్ మేధావులు వక్కాణిస్తున్నారు కదా. మరి తమ్ముడికే ఆ హక్కువున్నాప్పుడు అన్నకు అన్యాయం జరిగితే ఎలా? అన్నలు ఉద్యమిస్తే కష్టం. రక్తపాతాలే11
బాబూ, నీతి నియమాలు, వావి వరసలు….
మాట్లాడకు, అభివృద్ధి నొరోధక, వర్గ, వర్ణ విచక్షణ సమర్ధక అడుసులో నొక్కిన చెక్కముకా111
అరిచ్వాడు.
నేను నోరు మూసుకున్నాను.
నా కళ్ళముందు ఒక అధ్బుతమయిన నిజం కనిపిస్తోంది.
నరకాసురుడితో యుద్ధం చేయలేక కృష్ణుడు మూర్చపోతే, నరకాసురుడి రూపం చూసి మోహించిన సత్యభామ, నరకుడితో సుఖించి, ఇంత సుందర దేహాన్ని చంపాలా అని ఆలోచించి నరకుడితో కలైసి పారిపోతుంది. కానీ, సాంప్రదాయ వాదులు ధర్నాలు చేసి కోర్టులో కేసులు వేసేసరికి వెధవలు నన్ను బ్రతకనివ్వరని, బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాల్లోని ఘాటయిన సెక్స్ దృష్యాలలోలా నరకుడితో అన్నీ అనుభవించి, వాడిని ఐస్ ప్రిక్ తో పొడిచి చంపేస్తుంది.
కృష్ణుడికి తెలివి వచ్చేసరికి అతని రథంలో వుంటుంది. ఇప్పుడు నిజం చెప్పటానికి నరకుడూ లేడుకదా. ఈ నిజాన్ని నేనొక్కడినే నా దివ్య దృష్టితో తెలుసుకున్నాను. ఇప్పుడు సత్యభామను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను.
ఏమని?
ఆమెని దేవత, విశిష్ట నారీమణి అని భావిస్తున్న ప్రజలందరికీ సత్యభామ ఎస్కేపేడ్లన్ని పూసగుచ్చినట్టు చెప్తాను. అలా చెప్పకూడదంటే నేనో కోరిక కోరాను. అది ఇవ్వాలి.
ఏమిటది?
అమ్మా, అలా చెప్పేస్తానా?
ఇవ్వకపోతే?
ఇవ్వకపోతే ఏముంది, ఇవన్నీ బహిర్గతం చేస్తాను. సాహిత్య అకాడెమీ అవార్డు కొట్టేసిన తొలి బుధగ్రహ వాసినవుతాను. అన్నాడు.
మూతపడని నా నోట్లోంచి ఎగురుకుంటూ బయటకు వచ్చి వెళ్ళిపోయాడు.
Posted 3 days, 20 hours ago at 7:36 pm. 2 comments
హైకు,
ఇ డోంట్ లైకూ,
అన్నాను హైకు అంటే ఏమిటో సరిగా తెలియనప్పుడు. మనవారు రాస్తున్న హైకులను చూసి, హైకు, కైకు? అని కూడా ప్ర్శ్నించాను. మన దగ్గర్ వున్న కవితారీతులను వదిలి లైట్ వైట్ హైకు వెంట కవులు పడటాన్ని హేళన చేసేవాడిని.
కానీ, ఇప్పుడు,
హైకూ, 
కాదంత,
లైటు వైటూ
అని అర్ధమయింది.
హైకూ, హెవీ వైటు, మహమ్మదలీ ఫైటూ అని అంటున్నానిప్పుడు.
హైకూ పట్ల నా ద్రుక్పథంలో ఇంత మార్పు రావటానికి ప్రధాన కారణం, డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ రచించిన హైకు సారస్వతం పుస్తకం.
భావనా బలం లేనివారు, భాషపైన పట్టు సాధించాలన్న తపన లేక, నోటికొచ్చింది రాసేసి లేని వాటిని వూహించటమే తమ సృజనాత్మతకతకు నిదర్శనం గా చలామణీ చేసి పేరు సంపాదించాలనుకున్న చేతకాని ఆధునిక వచనకవుల కొత్త పాశుపతాస్త్రాల నమూనాలు హైకులు, నానీలు, నానోలు, నోనోలు, నీనీలు, నాకన్నాలూ లాంటి కవితవికృతాకృతులని అనుకున్నాను. నా ఆలోచనలో పొరపాటున నాకర్ధం చేసిన పుస్తకం ఇది.
ఈ పుస్తకంలో 10 అధ్యాయాలున్నాయి.
హైకు సాహిత్యం పూర్వాపరాలు, మౌలిక అంశాలు, లక్షణాలు, స్వభావం, సౌష్టవం, లయ, సాంప్రదాయం, విస్తరణ, నిర్మాతలు వంటి అధ్యాయాలు హైకు జపాన్ వారి సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యం వహిస్తుందో, ఎలా హైకు అభివ్రుద్ధి చెందిదో మనకు తెలుపుతాయి.
హైకు అంటే ఏవో అర్ధంలేని మూడు గజిబిజి వాక్యాల కూర్పు అని మన తెలుగు హైకులు చదవగా ఏర్పడిన తేలిక అభిప్రాయం తప్పని తెలుస్తుంది.
అయితే, వేదాలలో హైకు అన్న అధ్యాయంలో వాదన అంత ఆమోదయోగ్యంగా తార్కికంగా లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా మానవుడి ఆలోచనాసంవిధానంలోని ఏకసూత్రత గురించిన ఆలోచనలు కలిగిస్తుంది.
తెలుగు సాహిత్యంలో హైకు అన్న అధ్యాయం చదివినా తెలుగు హైకులపట్ల ఎలాంటి మైకం గౌరవం కలగవు.
ఈ పుస్తకం చదివిన తరువాత జపానీయులు సాంప్రదాయ కవితాప్రక్రియ అన్న భావంతో హైకు పై గౌరవం కలుగుతుంది. కానీ, మనవారు మన సాంప్రదాయ రక్రియలు వదిలి పరాయి ప్రక్రియల మోజులో పడటం కోకిల కాకి అవ్వాలన్న ప్రయత్నమే అన్న అభిప్రాయం మాత్రం బలపడుతుందీ పుస్తకం చదివినతరువాత.
హైకు గురించి ఇంతగా పరిశోధించి అనేక వివరాలను అందించిన రచయిత అభినందనీయుడు.
హైకు సారస్వతం
రూప్ కుమార్ డబ్బీకార్
150 పేజీలు,
70 రూపాయలు
పాలపిట్ట బుక్స్
16-11-20/6/1/1
403, విజయసాయి రెసిడెన్సి
సలీం నగర్, మలక్ పేట్
హైదెరాబాద్-36.
9848787284.
Posted 4 days, 18 hours ago at 10:03 pm. 2 comments
ఆదివారం అంటే 8వ తారీఖున, రాత్రి ఎనిమిది గంటలకు వేదిక అనే చర్చ కార్యక్రమం ప్రసారమవుతుంది.
ఈ వేదిక కార్యక్రమం లో మహిళల సమానహక్కులు, అవకాశాలు అనే అమ్షం పైన చర్చ జరుగుతుంది.
ఈ చర్చలో నేను, కొండవీటి సత్యవతి గారు, ఎం వీ లక్ష్మి గారు పాల్గొన్నాము.
ఈ కార్యక్రమం చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి.
సప్తగిరి చానెల్ లో….
ఆదివారం, 8వ తారీఖు,
రాత్రి 8 గంటలకు,
వేదిక కార్యక్రమము చూడండి.
Posted 5 days, 15 hours ago at 1:10 am. 1 comment
మా రైల్వేలో లలితకళాసమితి అని సాంస్కృతిక సంస్థ వుంది. వారు రైల్వే ఉద్యోగం చేస్తూ సాహిత్య రంగంలో చురుకుగా రచనలు చేస్తున్న వారిని సన్మానించాలని అనుకున్నారు. మొత్తం అయిదుగురికి చేయాలని అనుకున్నారు. మరి ఎలాగ తెలిసిందో ఆ అయిదుగురిలో నన్నూ ఒకరిగా ఎంచుకున్నారు.
నన్ను అడిగితే నేను మరో మంచి రచయిత పేరు సూచించాను. ఎందుకంటే నేను ఎన్నడూ లలిత కళా సమితి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. కాబట్టి, లలిత కళా సమితిలో చురుకుగా పాల్గొంటూ, రచనలు చేస్తున్న ఆ రచయితను సత్కరిస్తే ఔచిత్యంగా వుంటుందని అన్నాను.
మేము అయిదుగురికే సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు.
నాబదులు ఆయనకు చేయండి అన్నాను.
తీరాచూస్తే వారు అతికించిన పోస్టర్లలో నా పేరుంది.
సన్మానం చేయాలనుకున్నది వారిష్టం. మధ్యలో నీ బోడిసలహాలతో సన్మానం రా మోకాలొడ్డకు అన్నారు శ్రేయోభిలాషులు.
అదీ నిజమే అనిపించింది.
అందుకే అహ నాకు సన్మానంట అనుకుంటూ తయారయిపోతున్నాను. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇదిగో ఆహ్వానపత్రిక…….

Posted 1 week ago at 6:59 am. 2 comments
ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

Posted 1 week, 3 days ago at 7:48 am. 1 comment
ఆంధ్రభూమి మాస పత్రిక మార్చినెల సంచికలో మినీనవలగా నేను రచించిన సౌశీల్య ద్రౌపది నవల ప్రచురితమయింది.
ఇది కేవలం, వ్యాసభారతం, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. సందర్భానుసారం, అవసరమనుకున్న చోట, మూల కథ ఔచిత్యం భంగం కాకుండా కల్పనలు జోడించి రచించాను.
ఈనవల చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.
Posted 1 week, 4 days ago at 8:29 am. Add a comment
ఈభూమి మాస పత్రికలో పాడుతా-తీయగా శీర్షికన ప్రచురితమయిన వ్యాసం. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.


Posted 2 weeks ago at 7:34 am. 1 comment
రేపు అంటే , 22వ తారీఖు ,సాయంత్రం ఆరుగంటలకు, తెలుగు ఊనివర్సిటీ లో శ్రీ జగన్నథ శర్మ రచించిన పేగు కా;ఇన వాసన పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది.
అందరికీ ఆహ్వానం.
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు శ్రి కే శ్రీనివాస్ ప్రసంగిస్తారు.
అందరికీ ఇదే ఆహ్వానం.
పుస్తకాన్ని ప్రచురించింది పాలపిట్ట ప్రచురణలు.
Posted 2 weeks, 4 days ago at 1:41 am. 1 comment