Archive for the ‘pustaka paricayamu’ Category
గుంటూరులో సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ…
రేపు అంటే 25వ తారీఖున గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ ఫంక్షన్ పాలాస్, వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ జరుగుతుంది.
అందరికీ ఇదే ఆహ్వానం1111
June 23, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: pustaka paricayamu
జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం.
జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం.ఈవారం జాగృతి వార పత్రికలో సౌశీల్య ద్రౌపది పరిచయం ప్రచురితమయింది. ఆ పరిచయాన్ని ఈ క్రింద చదవండి.
June 17, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: pustaka paricayamu, నా రచనలు.
ఆంధ్రప్రభలో సౌశీల్య ద్రౌపది సమీక్ష.
ఈ రోజు ఆంధ్రప్రభ సాహిత్య పేజీలో సౌశీల్య ద్రౌపది సమీక్ష ప్రచురితమయింది. అది ఇక్కడ చదవండి..
June 13, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: pustaka paricayamu
జూన్ నెల పాలపిట్ట విడుదలయింది.
జూన్ నెల పాలపిట్ట మాస పత్రిక విడుదలయింది.
ఇది బండి నారాయణ స్వామి ప్రత్యేక సంచిక.
ఈ సంచికలో నాన్సీ ఫ్రైడే సాహిత్యాన్ని విశ్లేషిస్తూ, సమాజం పై దాని ప్రభావాన్ని వివరించే నా వ్యాసం వుంది.ల్
June 11, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: pustaka paricayamu
దర్శనం మాస పత్రికలో, సౌశీల్య ద్రౌపది సమీక్ష.
జూన్ నెల దర్శనం మాసపత్రికలో ప్రచురితమయిన సమీక్ష ఇది.
June 9, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: pustaka paricayamu, నా రచనలు.
తెనాలి ప్రయాణ విశేషాలు….
మే 2వ తారీఖున తెనాలిలో సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఆ సభకోసమని తెనాలి వెళ్ళాను. ఆ విశేషాలు రాయాలని ఎప్పటినుంచో అనుకుంటూంటే ఇప్పుడు సమయం చిక్కబరచుకున్నాను.
ఇటీవలి కాలంలో కాస్త బిజీ అయ్యాను. ఆఫీసులో పనితో పాటూ ద్రౌపది సభలు, సమావేశాలతో పాటూ నా ఇతర రచనలు. కాలంలూ రాస్తూండటంతో బ్లాగుకోసం ప్రత్యేకంగా సమయం చిక్కలేదు.
ఈ నెల ఎంతగా బిజీ అయ్యానంటే తొలిసారిగా, కథాసాగరమథనం శీర్షికకు సమయానికి మాటర్ అందించలేక పోయాను. వచ్చేనెల ఏప్రిల్, మే నెల కథల విశ్లేషణ వుంటుందీ శీర్షికలో. వార్తలో బ్లాగ్ స్పాట్ శీషికకు విరామమిచ్చిన తరువాతకూడా ఇలాంటి పరిస్థితి ఎదురయిందంటే ఎంత బిజీనో ఊహించవచ్చు.
అయితే, ఆనందకరమయిన విషయమేమిటంటే, సౌశీల్య ద్రౌపది నవల విడుదలయిన 15 రోజులలోనే 800 కాపీలు అమ్ముడవటం!
జూన్ 21వ తారీఖున కరీం నగర్ లో సమావేశముంది. అక్కడ అమ్మకాలు చూసి రెండవ ముద్రణ ఎప్పుడు వేయాలన్నది నిర్ణయిస్తాను.
నేను రాసిన పుస్తకాలలో ఏ పుస్తకమూ ఇలా అమ్ముడు పోలేదు.
ఈ అమ్మకాల ఆరంభం తెనాలి సభతో అయింది.
ఆదివారం ప్రొద్దున్నే జన్మభూమి రైలులో తెనాలి ప్రయాణమయ్యాను.
ఏసీ చైర్ కారు చల్లగా వున్నా, ఇరుకుగా వుంది. కానీ, చదువుతున్న పుస్తకం ఆసక్తి కరంగా వుండటంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.
కాసేపటికి టాయిలెట్ కు వెళ్ళాలని లేచాని. యధాలాపంగా చూస్తే చివరి వరుసలో జయధీర్ తిరుమలరావు గారు కనిపించారు. వారూ తెనాలికే వస్తున్నానన్నారు. వారికి ఆరోజు సన్మానమన్నారు.
వారి పక్కనే వున్న వ్యక్తిని చూపి జస్టిస్ చలమయ్య గారని పరిచయం చేశారు. వారి వెనకే ఏకే ప్రభాకర్ కనిపించారు.
ఇంక ఆగలేక పోయాను. ప్రభాకర్ పక్కన కూచున్న అబ్బాయిని రిక్వెస్ట్ చేఇ నా సీటుకి పంపాను. నేను నా పుస్తకాలు తీసుకుని ప్రభాకర్ పక్కకు వచ్చేశాను.
కాస్సేపు మాట్లాడుకున్నాం. అందరికీ సౌశీల్య ద్రౌపది కాపీలిచ్చాను. జస్టిస్ గారు చదవటం ఆరంభించేశారు. తిరుమలరావుగారి కాపీ మనోజ్ఞ గారు చదవటం ఆరంభించారు. ఏకే ప్రభాకర్ కూడా చదువుతూ వ్యాఖ్యానించటం చేస్తున్నాడు.
ఇంతలో మరో సీటులో వున్న అందెశ్రీ పరిచయమయ్యారు. వారిపక్కనే వున్న బ్లాగరు, గుర్రం సీతారాములు కూడా పరిచయమయ్యాడు.
నేనూ సీతారాములూ మాట్లాడుతూంటే, అందెశ్రీ పాడటం ఆరంభించాడు.
కొమ్మ చెక్కితే బొమ్మరా అన్న పాట అద్భుతమయితే, నదిని గూర్చిన పాట కవిత్వ పరంగా పరమాద్భుతం.. అయితే ఆయన గొంతు శిక్షణ లేక కాబోలు అపస్వరాలు పలికింది.


కానీ, ఆ కవిత విని ముగ్ధుడనయిన నేను వారిని పరిచయం చేసుకోవాలని తహ తహ లాడాను. పరిచయం చేసుకున్నాను. నా పుస్తకం అట్ట, పేరు చూసి అందెశ్రీ మెచ్చుకున్నారు. ఆయన ఫోటో తీసుకున్నాను.
అలాంటి గీతం రాయగలిగిన అతని పక్కన కూర్చుని కాస్సేపయినా ప్రయాణం చేయగలగటం నా అదృష్టం.
తెనాలిలో వారి దారి వారిది అయింది. నా దారి నాది అయింది.
ఆరోజు నాకు వెలగా వెంకటప్పయ్య గారింట్లో ఆతిథ్యం.
వెలగా వెంకటప్పయ్య గారిని చూస్తే నిండుకుండతొణకదు అంటే ఏమిటో తెలుస్తుంది. ఆయన రాసిన పుస్తకాలు, ఎడిట్ చేసిన పుస్తకాలూ ఒక బీరువా నిండా వున్నాయి. ఆయన నెలకు 65 పత్రికలు తెప్పించుకు చదువుతారు. ఇప్పుడాయన డిక్షనరీ ప్రూఫులు చూస్తున్నారు.
ఇంత సాధించినా ఆయన గొప్పలు చెప్పుకోరు. గుర్తింపుకోసం ఆత్ర పడరు.


అంతలోనే ఆయన నా నవల చదివేసి, అద్భుతం, అన్నారు. నా దగ్గర ఇంకో నవల కొనుక్కున్నారు. అదీ ఆయన గొప్పతనం. నవల కాంప్లిమెంటరీ తీసుకుని చదవకుండా పక్కన పడేసే వారిని తలచుకుని ఆయన సహృదయతకు జోహార్లర్పించాను.
సమావేశంలో బీరం సుందరరావుగారు పరిచయమయ్యారు.
అదేరోజు, అదే సమయానికి, దగ్గరలోనే ఏసీ హాలులో తిరుమలరావుగారి సన్మానసభ వుండటంతో అందరూ అటువెళ్ళిపోయారు. అయినా సభలో వున్నవారు ఆనందించారు. అనూహ్యంగా, 50 కాపీలు అమ్ముడుపోయాయి. నేను, తగ్గింపు ధరకు ఇస్తానన్నా వద్దని పూర్తి ధర చెల్లించి మరీ కొన్నారు. ఒకావిడ సభ పూర్తయ్యేలోగా చదివేసి, ఇంకో రెండు కాపీలు కొనుక్కుంది.
దాంతో నాకు నా నవల పైన ఆత్మ విశ్వాసం పెరిగింది. తెనాలి వాసుల సహృదయానికి అంజలి ఘటించాను.
సభ యిన తరువాత, వెంకటప్పయ్య గారు, తెనాలిలో చక్రపాణి గారు పనిచేసిన మెడికల్ దుకాణము చూపించారు. అక్కడ వున్న అనేక సాహిత్యకారులతో తన అనుభవాలు చెప్పారు.
తిరుగు ప్రయాణంలో రైల్వే స్టేషనులో మళ్ళీ అంతా కలిశారు. కానీ, రిజర్వేషన్ దొరకని హడావిడిలో వున్నారు.
అంతలో పొత్తూరి వేంకటేశ్వర్ రావు గారు కనిపించారు. వారికి నన్నునేను పరిచయం చేసుకుని, నా పుస్తకం ఇచ్చాను. అక్కడే ఆర్. నారాయణ మూర్తి కూడా కనిపించాడు.
ఇంతలో రైల్ వచ్చింది. అనేక ఆనందకరమయిన అనుభవాలను తలచుకుంటున్న నన్ను తెచ్చి సికిందరాబాదులో పారేసింది.
ఆతరువాత హయ్దెరాబాదులో, వరంగల్ లో సభలు జరిగాయి. ఇంకా అనేకులు నా దగ్గర పదులు, ఇరవైల సంఖ్యలో కాపీలు కొన్న్నారు. చర్చలకు గోష్టులకు పిలిచారు. ఒకాయన ఇల్లువెతుక్కుంటూ వచ్చి రెండుగంటలు మాట్లాడి, నా ఇతర పుస్తకాలన్నీ కొనుక్కుని వెళ్ళాడు.
ఇలాంటి అనేక అద్భుతమయిన అనుభవాలకు తెనాలి ప్రయాణం నాందీ ప్రస్తావన . అందుకే ఇకపైన నా పుస్తకమేది తయారయినా ముందు తెనాలిలో శారద సాంస్కృతిక సంస్థకు పంపుతాను. వారిద్వారా తెనాలిలోనే ప్రథమంగా ఆవిష్కరింప చేస్తాను అని నిర్ణయించుకున్నాను.
ఆయన సాయంత్రంలోగా
సాయంత్రంలోగా
June 4, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: pustaka paricayamu









